బీజాపుర్లో 15 మంది మావోయిస్టుల హతం
- May 16, 2017
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్లో 15 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ మంగళవారం తెలిపారు. దాదాపు 350 మంది జవాన్లతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సుకమాలో గత నెలలో 25 మంది జవాన్లను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బలగాలు చేపట్టిన ప్రధాన చర్యల్లో ఇదే మొదటిది. మావోయిస్టు పీడిత ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన వారంలోనే తాజా ఆపరేషన్ జరిగింది. .
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







