బీజాపుర్‌లో 15 మంది మావోయిస్టుల హతం

- May 16, 2017 , by Maagulf
బీజాపుర్‌లో 15 మంది మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌లో 15 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మంగళవారం తెలిపారు. దాదాపు 350 మంది జవాన్లతో ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సుకమాలో గత నెలలో 25 మంది జవాన్లను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బలగాలు చేపట్టిన ప్రధాన చర్యల్లో ఇదే మొదటిది. మావోయిస్టు పీడిత ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన వారంలోనే తాజా ఆపరేషన్‌ జరిగింది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com