జూన్ 2న తెలంగాణ సర్కార్ కెసిఆర్ 2 కొత్త పథకాలు
- May 17, 2017
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. జూన్ 2న కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు ఆర్ధిక భృతి, కేసీఆర్ కిట్ల పంపిణీతో పాటు ప్రభుత్వం అదే నెలలో గొర్రె పిల్లల పంపిణీ కూడా చేపట్టనుంది. దీనికోసం ఇప్పటికే కసరత్తులు కూడా పూర్తి చేసింది. కిట్ల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సీఎస్ స్ధాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష కూడా జరిగింది. లక్షా 80 వేల మంది గర్భిణులు ఈ పథకంలో రిజిష్టర్ చేసుకున్నారు. ఈ సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉండచ్చని అధికారుల అంచనా.జిల్లాల్లోని అన్ని ఆస్పత్రుల్లో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అవసరమైన మేరకు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని కూడా నియమించాలని సర్కార్ సూచించింది. కేసీఆర్ కిట్స్ పథకం కోసం స్పెషల్ సాఫ్ట్ వేర్ కూడా రూపొందించారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్న వారికి రెండు వేలు రూపాయల విలువైన కేసీఆర్ కిట్ అందిస్తారు. దీంతోపాటూ మగ శిశువుకు 12 వేలు, ఆడ శిశువుకు 13 వేలు 4 విడతలుగా చెల్లిస్తారు. బ్యాంక్ అకౌంట్ ఉంటే నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న హైదరాబాద్ లో సీఎం, జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కిట్లు పంపిణీ చేస్తారు. ఒంటరి మహిళలకు ఆర్ధిక భృతి పథకానికి కూడా ఈ నెల 8 నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. వీటిని వెంటనే పరిశీలించి.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ పథకం పై ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించారు. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒంటరి మహిళలకు కూడా జూన్ 2 నుంచే ప్రభుత్వం పెన్షన్లు అందించనుంది. కొత్త పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి పారదర్శకంగా పథకాల అమలయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







