హారర్ సినిమాగ రాబోతున్న రేష్మీగౌతమ్ 'అంతకుమించి'
- May 18, 2017
సతీశ్ జై, రేష్మీగౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంతకుమించి'. జానీ దర్శకుడు. సతీశ్ నిర్మాత. హైదరాబాద్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేష్మీ మాట్లాడుతూ ''ఇందులో నా పాత్ర పేరు మధుప్రియ. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చెయ్యలేదు. టైటిల్కు సరిగ్గా సరిపోయే సినిమా ఇది. కొత్త అంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి'' అని తెలిపింది. ''హారర్ థ్రిల్లర్ ఇది. హారర్లో కొత్త జోనర్ చూపిస్తున్నాం. హీరో, హీరోయిన్ లకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
70 శాతం షూటింగ్ పూర్తయింది.'' అని దర్శకుడు చెప్పారు. మిగిలిన రెండు పాటల్ని గోవాలో చిత్రీకరిస్తాం. త్వరలో పాటల్ని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







