ప్రకాశం జిల్లా వేమవరంలో పడగవిప్పిన ఫ్యాక్షన్
- May 19, 2017
ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరంలో గొట్టిపాటి-కరణం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కె.రాజుపాలెంలో ఓ వివాహానికి హాజరై ద్విచక్ర వాహనాలపై వస్తున్న కరణం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చిలకలూరుపేటలోని వైద్యశాలకు తరలిస్తుండగా అంజయ్య, రామ కోటేశ్వరరావులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పేరయ్య, వెంకటేశ్వర్లు, ముత్యాలు, రాఘవులు చికిత్స పొందుతున్నారు. పాతకక్షల నేపథ్యంలో కరణం బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేసినట్లు తెలిసింది.
బాధితులను పరామర్శిచిన ఎమ్మెల్సీ
దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కరణం బలరాం నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల చక్రబంధంలో బల్లికురువ
ఫాక్షన్ హత్యల నేపథ్యంలో బల్లికురువ మండలం పోలీసులు బందోబస్తును పెంచారు. వేమవరం గ్రామంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మ వేమవరంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నలుగురు డీఎస్పీలు వేమవరంలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
సీఎం ఆగ్రహం
బల్లికురువ మండలం వేమవరం వద్ద జరిగిన హత్యలపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదన్నారు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









