ఆస్ట్రేలియాలో ప్రదీప్ సింగ్ అనే భారతీయ ట్యాక్సీ డ్రైవర్పై దాడి
- May 22, 2017
అసభ్య పదజాలంతో దూషణ
ఆస్ట్రేలియాలో మరోసారి జాత్యాంహకార దాడి జరిగింది. భారతదేశానికి చెందిన ప్రదీప్ సింగ్(25) అనే ట్యాక్సీ డ్రైవర్పై ఆస్ట్రేలియాకు చెందిన భార్యభర్తలు దాడి చేసి దూషించారు. ప్రదీప్ ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి టాస్మానియా రాష్ట్రంలో ఇద్దరు ప్రయాణికులను కారులో తీసుకొని వెళ్తున్నారు. సాండీ బే వద్ద గల మెక్డొనాల్డ్ రెస్టారెంట్కు వచ్చే సరికి అందులో ఉన్న మహిళకు వాంతి వస్తున్నట్టు అనిపించింది. కారులో వాంతి చేసుకుంటే శుభ్రం చేసేందుకు రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఆగ్రహించిన వారు శుభ్రపరిచేందుకే కాదు ప్రయాణ చార్జీ కూడా చెల్లించమంటూ వాగ్వాదానికి దిగారు. ప్రదీప్ను కొట్టడమేగాక కాలుతో తన్ని అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో పోలీసులు ఆయనను రాయల్ హోబార్డ్ దవాఖానలో చేర్చినట్టు ఇన్స్పెక్టర్ ఇయాన్ విష్ విల్సన్ పేర్కొన్నారు. భార్యభర్తలపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వారిని హోబార్డు మేజిస్ట్రేట్ ముందు జూన్ 26న హాజరుపరుస్తామని చెప్పారు.
ఏడాదిలో ఆస్ట్రేలియాలో ఇది మూడో జాత్యాంహకార దాడి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







