ప్రపంచంలో దేశీయ వలసల్లో భారత్ది మూడోస్థానం
- May 22, 2017
భారత్లో 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోనే వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారని ఓ నివేదిక పేర్కొంది. అంతర్గత వలసలు ఎక్కువగా నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం (ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి (ఎన్ఆర్సీ)లు కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. నివేదిక ప్రకారం 2016లో అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలసపోగా, తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్ (59 లక్షల మంది) ఉంది.
ఘర్షణలు, హింస, ప్రకృతి విపత్తులు స్వదేశీ వలసలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 3.1 కోట్ల మంది స్వదేశాల్లోనే తమ నివాస స్థలాలను మార్చుకోవాల్సి వచ్చింది. 2015లో దక్షిణాసియా దేశాల్లో 79 లక్షల మంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లగా, 2016లో ఈ సంఖ్య సగానికి పైగా తగ్గి 36 లక్షలకు పరిమితమైంది. ఇందులో భారత్ నుంచే 24 లక్షల మంది ఉండడం గమనార్హం. భారత్లో బిహార్లో గతేడాది జూలై–అక్టోబర్ల మధ్య సంభవించిన వరదల వల్లే 16 లక్షల మంది వలసపోయారని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









