ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్ దాడి: 23మంది మృతి

- May 26, 2017 , by Maagulf
ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్  దాడి: 23మంది మృతి

ఈజిప్టులో ఓ బస్సుపై గన్మెన్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడినట్లు అక్కడి స్టేట్ టీవీ వెల్లడించారు. శుక్రవారం మిన్యా ప్రావిన్స్లోని సెయింట్ శామ్యూల్ మోనస్టీ నుంచి బయలుదేరిన బస్సుపై కాల్పులు జరిగాయి. దాడిని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడా ధ్రువీకరించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
గత నెల ఈజిప్టులోని రెండు ప్రముఖ చర్చిలపై గంటల వ్యవధిలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈస్టర్ పండుగకు వారం ముందు ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 47 మందిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com