తానా సభలకు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్
- May 26, 2017
త్వరలో అమెరికాలో జరగబోయే ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మహా సభలకు ముఖ్య అతిదిగా ఆహ్వానం అందుకున్నారు నందమూరి తారక రామారావు. ఈ సందర్భంగా జూనియర్లోని ఔదార్యం మరోసారి బయటపడింది. తను తన సోదరుడు కళ్యాన్ రాం వారి బృందానికి ప్రయాణ, నివాస ఖర్చులు తామే పెట్టుకుంటామని అందుకై తమపై పెట్టే ఖర్చును పేద పిల్లల చదువు కోసం వినియోగించాలని 'తానా' నిర్వాహకులను కోరారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.
అమెరికాలో త్వరలో జరగబోయే 'తానా' మహాసభలకు ఆహ్వానం అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మరియు అన్న కళ్యాణ్ రామ్. ఆ సందర్భంగా తమను అమెరికా ప్రయాణానికి టికెట్స్ తీయొద్దని, మేమే సొంతంగా టికెట్స్ పెట్టుకుని మహాసభలకు హాజరౌతామని అక్కడ వసతి ఖర్చులను కూడా తామే చూసుకుంటామని కార్యన్ర్వాహకులకు తెలిపారట.
అలాగే కళ్యాణ్ రామ్ కూడా 'తానా' నిర్వాహకులకు ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారట. తనకు తనతో పాటు వచ్చే వారికి ట్రావెల్ టికెట్స్ వసతి మొదలైనవి మేమే చూసుకుంటామని అని తేల్చిచెప్పేశారట.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









