తానా సభలకు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్
- May 26, 2017
త్వరలో అమెరికాలో జరగబోయే ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మహా సభలకు ముఖ్య అతిదిగా ఆహ్వానం అందుకున్నారు నందమూరి తారక రామారావు. ఈ సందర్భంగా జూనియర్లోని ఔదార్యం మరోసారి బయటపడింది. తను తన సోదరుడు కళ్యాన్ రాం వారి బృందానికి ప్రయాణ, నివాస ఖర్చులు తామే పెట్టుకుంటామని అందుకై తమపై పెట్టే ఖర్చును పేద పిల్లల చదువు కోసం వినియోగించాలని 'తానా' నిర్వాహకులను కోరారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.
అమెరికాలో త్వరలో జరగబోయే 'తానా' మహాసభలకు ఆహ్వానం అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మరియు అన్న కళ్యాణ్ రామ్. ఆ సందర్భంగా తమను అమెరికా ప్రయాణానికి టికెట్స్ తీయొద్దని, మేమే సొంతంగా టికెట్స్ పెట్టుకుని మహాసభలకు హాజరౌతామని అక్కడ వసతి ఖర్చులను కూడా తామే చూసుకుంటామని కార్యన్ర్వాహకులకు తెలిపారట.
అలాగే కళ్యాణ్ రామ్ కూడా 'తానా' నిర్వాహకులకు ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారట. తనకు తనతో పాటు వచ్చే వారికి ట్రావెల్ టికెట్స్ వసతి మొదలైనవి మేమే చూసుకుంటామని అని తేల్చిచెప్పేశారట.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









