ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి
- May 27, 2017
కాబూల్: ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. కారు బాంబ్ ఆత్మాహుతి దాడిలో సుమారు 18 మంది దుర్మరణం చెందారు. మరణించినవారిలో 10మంది భద్రతా సిబ్బందితో పాటు ఎనిమిది మంది సామాన్య పౌరులు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
ఖోస్ట్ ప్రావిన్స్లోని అత్యంత రద్దీ ప్రాంతంలో శనివారం ఈ కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీస్ చీఫ్ జనరల్ ఫైజులుల్లా తెలిపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని చెప్పారు. రందాన్ ప్రారంభం అయిన తొలిరోజే ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









