‘ఆరడుగుల బుల్లెట్’ జూన్ 9న విడుదల
- May 27, 2017
‘‘కొ న్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది. అయినా సరే, మంచి సినిమా తీశామన్న సంతృప్తి, ఆనందం కలుగుతున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రమిద’’న్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార కథా నాయిక. బి.గోపాల్ దర్శకుడు. తాండ్ర రమేష్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. శనివారం హైదరాబాద్లో విలేకరులతో గోపీచంద్ మాట్లాడుతూ ‘‘గోపాల్ గారితో కలసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. మధ్యలో ఆ అవకాశం వచ్చింది గానీ, కార్యరూపం దాల్చలేదు. ‘ఆరడుగుల బుల్లెట్’తో ఆ కల నెరవేరింది. వక్కంతం వంశీ కథ చెబుతున్నప్పుడే సినిమా చూసేశా. అబ్బూరి రవి మాటలు చక్కగా కుదిరాయి. మణిశర్మగారు మంచి పాటలిచ్చార’’న్నారు. ‘‘ఓ సినిమా తీస్తే ఇంటిల్లిపాదీ చూసేలా ఉండాలి అని రామానాయుడు గారు చెప్పేవారు.
ఆ మాటని తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నా. కుటుంబ బంధాలు, యాక్షన్, హీరోయిజం... ఇలా అన్నీ ఉన్నాయి.
‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ ప్రకటించగానే ‘గోపీచంద్ కటౌట్కి సరిపోయే టైటిల్’ అని చాలామంది మెచ్చుకొన్నార’’న్నారు బి.గోపాల్. ‘‘పీవీపీ సహకారంతో సినిమాని పూర్తి చేయగలిగాం. జూన్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’’న్నారు నిర్మాత. అబ్బూరి రవి, బాలమురుగన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









