ఎపి, తెలంగాణలో జికా వైరస్ అలర్ట్
- May 28, 2017
జికా వైరస్ దెబ్బకు తెలుగురాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఎయిర్ పోర్ట్ లు, పోర్ట్లను అప్రమత్తం చేశారు. ఈ వ్యాధి సోకిన వాళ్లెవరైనా ఉన్నారేమోనని ముమ్మరంగా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలనుంచి వస్తోన్న వాళ్లపై గట్టి నిఘా పెట్టారు.
ఇదిలాఉండగా, ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ఈ ప్రాణాంతక జికా వైరస్ ఇండియాలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు, నౌకాశ్రయ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ దోమకు సీజన్తో పని లేదని, ఇంటి చుట్టు పరిసరాల్లో దోమల వృద్ధి చెందకుండా జాగ్రత్త పడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేసుకోవాలని, ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









