ఎపి, తెలంగాణలో జికా వైరస్ అలర్ట్
- May 28, 2017
జికా వైరస్ దెబ్బకు తెలుగురాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఎయిర్ పోర్ట్ లు, పోర్ట్లను అప్రమత్తం చేశారు. ఈ వ్యాధి సోకిన వాళ్లెవరైనా ఉన్నారేమోనని ముమ్మరంగా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలనుంచి వస్తోన్న వాళ్లపై గట్టి నిఘా పెట్టారు.
ఇదిలాఉండగా, ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ఈ ప్రాణాంతక జికా వైరస్ ఇండియాలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు, నౌకాశ్రయ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ దోమకు సీజన్తో పని లేదని, ఇంటి చుట్టు పరిసరాల్లో దోమల వృద్ధి చెందకుండా జాగ్రత్త పడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేసుకోవాలని, ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







