లండన్ లో కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు
- May 29, 2017
లండన్: ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండే ఆ యువతి సాయుధుల చేతిలో ప్రాణాలుకోల్పోయింది. అప్పటి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ చల్లటి రాత్రిని ఆస్వాదిస్తూ అనూహ్యంగా మృత్యువాత పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వాయవ్య లండన్లోని బ్రెంట్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మోహనా అబ్దౌ అనే యువతిని అక్కడ అంతా మోంటాన అని పిలుస్తారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మోంటాన తమ ఇంటి పక్కనే ఉన్న చిన్నపిల్లలు ఆడుకునే క్రీడాస్థలానికి కొందరు స్నేహితురాళ్లతో కలిసి చేరుకుంది.
వారితో కలిసి చిన్నచిన్న సరదా ఆటలు ఆడుతోంది. అదే సమయంలో బైక్పై ముసుగుతో వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం సమూహంపైకి కాల్పులు జరపగా మిగితా వారంత తప్పించుకోగా దురదృష్టం కొద్ది ఒక్క మోంటానకు మాత్రం ఒకే ఒక్క బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి చనిపోయింది. అయితే, పోలీసులు మాత్రం ఆ కాలనీకి చెందినవారే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ దాడికి దిగినవారు స్వయంగా లొంగిపోవడమో.. లేక తెలిసిన వారు నిజం బయటకు చెప్పడమో చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









