కన్నడ సినీ పరిశ్రమలో విషాదం
- May 30, 2017
లెజండరీ నటుడు రాజ్కుమార్ సతీమణి కన్నుమూత
ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకొనగా.. అటు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవం రాజ్కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్కుమార్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు.
78 ఏళ్ల పార్వతమ్మ ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 14న ఆస్పత్రిలో చేరింది. అప్పటినుంచి వెంటిలేటర్ మీద ఉన్న ఆమెకు వైద్యులు ప్రత్యేక శస్త్రచికిత్సలు నిర్వహించినా లాభం లేకపోయింది. పూర్ణ ప్రంగ వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త రాజ్కుమార్ తరహాలోనే పార్వతమ్మ కూడా తన రెండు కళ్లను దానం చేశారు.
రాజ్కుమార్-పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. వీరి తనయులైన పునీత్ రాజకుమార్, శివరాజ్కుమార్ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు. నిర్మాతగా కూడా పార్వతమ్మ తనదైన ముద్ర వేశారు. ఆమె అప్పు, అరసు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసుకున్నారు. ఆమె కుటుంబానికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









