ప్రముఖ దర్శకుడు దాసరి అంత్యక్రియలు పూర్తి
- May 31, 2017
హైదరాబాద్: దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ మండలం తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య దాసరి సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియల్ని పూర్తిచేశారు.
మంగళవారం రాత్రి దాసరి మరణవార్త తెలుసుకొని తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీరు మున్నీరైంది. ఆయనను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం ప్రజల సందర్శనార్థం దాసరి భౌతికకాయాన్ని ఇంటి నుంచి ఫిలింఛాంబర్కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి మొయినాబాద్లోని దాసరి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









