తగ్గిన పసిడి,వెండి ధరలు
- May 31, 2017
దిల్లీ: బుధవారం బంగారం ధర తగ్గింది. రూ.250 తగ్గడంతో పది గ్రాముల పుత్తడి ధర రూ.29,100కి చేరింది. అంతర్జాతీయ పరిశ్రమలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో పసిడి ధర తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వెండి ధర నేడు పడిపోయింది. రూ.450 తగ్గడంతో కిలో వెండి ధర రూ.40వేలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.02శాతం తగ్గి ఔన్సు 1,262.60 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







