తగ్గిన పసిడి,వెండి ధరలు

- May 31, 2017 , by Maagulf
తగ్గిన పసిడి,వెండి ధరలు


దిల్లీ: బుధవారం బంగారం ధర తగ్గింది. రూ.250 తగ్గడంతో పది గ్రాముల పుత్తడి ధర రూ.29,100కి చేరింది. అంతర్జాతీయ పరిశ్రమలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో పసిడి ధర తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వెండి ధర నేడు పడిపోయింది. రూ.450 తగ్గడంతో కిలో వెండి ధర రూ.40వేలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.02శాతం తగ్గి ఔన్సు 1,262.60 అమెరికన్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com