పట్టాలెక్కనున్న మోనో రైల్
- October 10, 2015దశాబ్ద కాలం క్రితం ప్లాన్ చేసిన మోనో రైల్ ప్రాజెక్ట్, ఇప్పుడు పట్టాలెక్కేలి కనిపిస్తోంది. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే జిసిసి రైల్వేలో భాగంగా బహ్రెయిన్ మోనో రైల్ ప్రాజెక్ట్ని కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 22 కిలోమీటర్ల మేర లైట్ రైల్ నెట్ వర్క్ కోసం టెండర్లను ఆహ్వానించారు. రెండు లైన్లతో, 19 స్టేషన్లు కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్. 8 వేల మంది ప్రయాణీకుల సమర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నారు. మలేషియా సంస్థ షోమి ఇంజనీరింగ్ 2008లో 83 కిలోమీటర్ల ప్రాజెక్ట్ని, 20 ఏళ్ళలో కంప్లీట్ చేయాలనుకుంది. కానీ కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. అయితే ఈసారి ఎలాంటి ఆటంకాలూ లేకుండా లైట్ లైర్ ప్రాజెక్ట్ (మోనో రైల్)ను అనుకున్న మేర పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







