దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమ యాత్ర పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
- June 04, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయి రోజులు గడిచి పోతున్నా ఆ షాక్ నుండి ఆయన సన్నిహితులు మాత్రం ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ముఖ్యంగా మోహన్ బాబు ఈ షాక్ నుండి ఏమాత్రం తేరుకోలేదు అన్న అభిప్రాయం ఆయన మాటల వల్ల అర్ధం అవుతోంది. దాసరి అంతిమ యాత్రలో చిత్రసీమకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు పాల్గొనలేదనే విషయం పై ఇప్పటికే అనేక కామెంట్స్ వచ్చాయి.
ఒక్క వెంకటేష్ ను మినహాయిస్తే దాసరితో సినిమాలు చేసిన అనేకమంది ప్రముఖ హీరోలు హీరోయిన్స్ నటులు నిర్మాతలు కనీసం దాసరిని కడసారి చూడటం కోసం అంతిమ యాత్రకు రాకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయమై ఎవరూ బహిరంగంగా కామెంట్ చేయకపోయినా మోహన్ బాబు మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు.
దాసరి నుంచి సాయం పొంది, చివరి రోజున ఆయనను చూడటానికి కూడా రాని వాళ్లను విశ్వాస ఘాతకులుగా అభివర్ణించారు మోహన్ బాబు. దాసరి పాద ధూళి తగిలితే చాలు అని ఆయన పాదాల మీద పడ్డ వాళ్లు, ఆయన ద్వారా ఎంతో లబ్ధి పొందిన వాళ్లు దాసరిని కడసారి చూడటానికి రాకపోవడం విశ్వాస ఘాతుకం అంటూ పెద్దపెద్ద పదాలను వాడుతున్నాడు మోహన్ బాబు.
దాసరి బ్రతికి ఉన్న రోజులలో ప్రతిరోజు అను నిత్యం ఆయన పక్కన ఉన్న చాలామంది దాసరి చనిపోయిన తరువాత ఆయన ఇంటి వైపు కూడా రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు.. దాసరితో బోలెడన్ని సినిమాలు చేసి ప్రాముఖ్యత పొందిన వారు దాసరిని కడసారి చూడటం కోసం రాకపోవడం టాపిక్ ఆఫ్ డి టాలీవుడ్ గా మారింది. అయితే టాలీవుడ్ సినిమా రంగంలో వ్యక్తులను అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకుని ఆ తరువాత పూర్తిగా మరిచిపోయే సంస్కృతి మోహన్ బాబుకు తెలియదా ? అన్నదే సందేహం
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







