దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమ యాత్ర పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
- June 04, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయి రోజులు గడిచి పోతున్నా ఆ షాక్ నుండి ఆయన సన్నిహితులు మాత్రం ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ముఖ్యంగా మోహన్ బాబు ఈ షాక్ నుండి ఏమాత్రం తేరుకోలేదు అన్న అభిప్రాయం ఆయన మాటల వల్ల అర్ధం అవుతోంది. దాసరి అంతిమ యాత్రలో చిత్రసీమకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు పాల్గొనలేదనే విషయం పై ఇప్పటికే అనేక కామెంట్స్ వచ్చాయి.
ఒక్క వెంకటేష్ ను మినహాయిస్తే దాసరితో సినిమాలు చేసిన అనేకమంది ప్రముఖ హీరోలు హీరోయిన్స్ నటులు నిర్మాతలు కనీసం దాసరిని కడసారి చూడటం కోసం అంతిమ యాత్రకు రాకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయమై ఎవరూ బహిరంగంగా కామెంట్ చేయకపోయినా మోహన్ బాబు మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు.
దాసరి నుంచి సాయం పొంది, చివరి రోజున ఆయనను చూడటానికి కూడా రాని వాళ్లను విశ్వాస ఘాతకులుగా అభివర్ణించారు మోహన్ బాబు. దాసరి పాద ధూళి తగిలితే చాలు అని ఆయన పాదాల మీద పడ్డ వాళ్లు, ఆయన ద్వారా ఎంతో లబ్ధి పొందిన వాళ్లు దాసరిని కడసారి చూడటానికి రాకపోవడం విశ్వాస ఘాతుకం అంటూ పెద్దపెద్ద పదాలను వాడుతున్నాడు మోహన్ బాబు.
దాసరి బ్రతికి ఉన్న రోజులలో ప్రతిరోజు అను నిత్యం ఆయన పక్కన ఉన్న చాలామంది దాసరి చనిపోయిన తరువాత ఆయన ఇంటి వైపు కూడా రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు.. దాసరితో బోలెడన్ని సినిమాలు చేసి ప్రాముఖ్యత పొందిన వారు దాసరిని కడసారి చూడటం కోసం రాకపోవడం టాపిక్ ఆఫ్ డి టాలీవుడ్ గా మారింది. అయితే టాలీవుడ్ సినిమా రంగంలో వ్యక్తులను అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకుని ఆ తరువాత పూర్తిగా మరిచిపోయే సంస్కృతి మోహన్ బాబుకు తెలియదా ? అన్నదే సందేహం
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









