బ్రెజిల్ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సహాయంచేసే రోబో
- June 04, 2017
విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి క్యూల్లో నిలబడే అవసరం ఇక గతం కానున్నది. ప్రయాణికులకు సహాయంచేసే చెక్ఇన్ రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. విమానాశ్రయాలకు ఐటీ, టెలికమ్యూనికేషన్ల సేవలందించే సీత కంపెనీకి చెందిన పరిశోధకులు ఈ రోబోను తయారుచేశారు. కేట్ కియోస్క్గా పిలువబడే ఈ రోబో స్వతంత్రంగాను, రోబోల బృందాలతో కలిసి కూడా పనిచేయగలదు. విమానం, ప్రయాణికుల రద్దీ సమాచారం సహాయంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఈ కియోస్క్ గుర్తిస్తుంది. తనిఖీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు ఉన్న మార్గంలో కదులుతుంది. చెక్ఇన్ కేంద్రాలు ఎక్కడున్నాయో వారికి తెలుపుతుంది. ప్రస్తుతం మూడు కియోస్క్లను తయారు చేశామని, అందులో ఒకదాన్ని త్వరలో భారత్కు పంపుతామని ఆ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









