బ్రెజిల్ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సహాయంచేసే రోబో
- June 04, 2017
విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి క్యూల్లో నిలబడే అవసరం ఇక గతం కానున్నది. ప్రయాణికులకు సహాయంచేసే చెక్ఇన్ రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. విమానాశ్రయాలకు ఐటీ, టెలికమ్యూనికేషన్ల సేవలందించే సీత కంపెనీకి చెందిన పరిశోధకులు ఈ రోబోను తయారుచేశారు. కేట్ కియోస్క్గా పిలువబడే ఈ రోబో స్వతంత్రంగాను, రోబోల బృందాలతో కలిసి కూడా పనిచేయగలదు. విమానం, ప్రయాణికుల రద్దీ సమాచారం సహాయంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఈ కియోస్క్ గుర్తిస్తుంది. తనిఖీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు ఉన్న మార్గంలో కదులుతుంది. చెక్ఇన్ కేంద్రాలు ఎక్కడున్నాయో వారికి తెలుపుతుంది. ప్రస్తుతం మూడు కియోస్క్లను తయారు చేశామని, అందులో ఒకదాన్ని త్వరలో భారత్కు పంపుతామని ఆ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









