దేవాలయాలను కాపాడుకుందాం:ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్
- June 04, 2017
ద్వారక తిరుమల వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమ్మేళనానికి పలువురు మఠాలు, పీఠాల అధిపతులు హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రముఖ దేవాలయాల్లో శిథిలమవుతున్న పురాతన కట్టడాలను ఎలా రక్షించుకోవాలి?, కనుమరుగువుతున్న శిలా శాసనాలను ఎలా సేకరించాలి? అనే విషయాన్ని పరిశీలించి, త్రీడీ పరిజ్ఞానంతో వాటిని రికార్డు చేసి, ఆర్కియాలజీ విభాగం ద్వారా భద్రపరచడమే ఈ సమ్మేళనం ఉద్దేశమని చెప్పారు. సోలార్ ఎనర్జీని వినియోగం, గో గ్రామాలను కాపాడుకోవడం తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అతను ఎన్ని దేవాలయాలను సందర్శించారన్న దానిని గుర్తించడానికి ఐరిస్ టెక్నాలజీని ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో సైనికుల్లా సమ్మేళనానికి హాజరవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







