దేవాలయాలను కాపాడుకుందాం:ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్
- June 04, 2017
ద్వారక తిరుమల వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమ్మేళనానికి పలువురు మఠాలు, పీఠాల అధిపతులు హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రముఖ దేవాలయాల్లో శిథిలమవుతున్న పురాతన కట్టడాలను ఎలా రక్షించుకోవాలి?, కనుమరుగువుతున్న శిలా శాసనాలను ఎలా సేకరించాలి? అనే విషయాన్ని పరిశీలించి, త్రీడీ పరిజ్ఞానంతో వాటిని రికార్డు చేసి, ఆర్కియాలజీ విభాగం ద్వారా భద్రపరచడమే ఈ సమ్మేళనం ఉద్దేశమని చెప్పారు. సోలార్ ఎనర్జీని వినియోగం, గో గ్రామాలను కాపాడుకోవడం తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అతను ఎన్ని దేవాలయాలను సందర్శించారన్న దానిని గుర్తించడానికి ఐరిస్ టెక్నాలజీని ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో సైనికుల్లా సమ్మేళనానికి హాజరవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









