దేవాలయాలను కాపాడుకుందాం:ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌

- June 04, 2017 , by Maagulf
దేవాలయాలను కాపాడుకుందాం:ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌

ద్వారక తిరుమల వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సమ్మేళనానికి పలువురు మఠాలు, పీఠాల అధిపతులు హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రముఖ దేవాలయాల్లో శిథిలమవుతున్న పురాతన కట్టడాలను ఎలా రక్షించుకోవాలి?, కనుమరుగువుతున్న శిలా శాసనాలను ఎలా సేకరించాలి? అనే విషయాన్ని పరిశీలించి, త్రీడీ పరిజ్ఞానంతో వాటిని రికార్డు చేసి, ఆర్కియాలజీ విభాగం ద్వారా భద్రపరచడమే ఈ సమ్మేళనం ఉద్దేశమని చెప్పారు. సోలార్‌ ఎనర్జీని వినియోగం, గో గ్రామాలను కాపాడుకోవడం తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అతను ఎన్ని దేవాలయాలను సందర్శించారన్న దానిని గుర్తించడానికి ఐరిస్‌ టెక్నాలజీని ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో సైనికుల్లా సమ్మేళనానికి హాజరవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com