న్యూజెర్సీకి చేరిన సాయి పాదుక యాత్ర
- June 07, 2017
అమెరికాలో షిరిడి ఆలయం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం... తన లక్ష్య సాధనలో కీలకమైన ఓ ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడి నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలను సేకరించడానికి 'సాయి దత్తపీఠం స్థల సేవ' పేరుతో అమెరికాలోని న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర... 43 రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ మంగళవారం న్యూజెర్సీకి చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు ప్రవాసాంధ్ర భక్తులు నీరాజనాలు పట్టారు. 5మైళ్లు సాగిన ఈ ముగింపు యాత్రలో వందకుపైగా కార్లతో భక్తులు హాజరయ్యారు. ముందు న్యూజెర్సీలోని మేడిచర్ల మురళికృష్ణ నివాసంలో సాయిపాదుక పూజ నిర్వహించారు. తరువాత పల్లకీ దాత కనికిచర్ల లీలాకృష్ణ నివాసంలో ఆఖరి పాదుక పూజ నిర్వహించి యాత్ర ప్రారంభించారు. స్థానిక పోలీస్ యంత్రాంగం దీనికి సహకరించింది. సాయి దత్తపీఠం సభ్యులు, భక్తులు వందల మంది యాత్రలో పాల్గొన్నారు.
దత్తపీఠం ప్రధాన నిర్వాహకుడు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్ల నుంచి అమెరికాలోని 43 రాష్ట్రాల్లో 75 వేల మైళ్ల దూరం పాదుక యాత్ర సాగింది. దత్తపీఠం సిద్ధంచేసిన సాయిరథం ద్వారా ఈ పాదుక యాత్ర 43 రాష్ట్రాల్లో దాదాపు 2వేల ఇళ్లకు చేరుకొని సాయిపాదుక పూజ చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









