భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- June 08, 2017
వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం నాటి ట్రేడింగ్లో ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.195 తగ్గి రూ.29,600లకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.150 తగ్గడం ద్వారా రూ.40,750కు చేరింది. పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,285.50 అమెరికన్ డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









