మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో... చెల్లించని కార్మికులకు ఉపశమనం

- June 08, 2017 , by Maagulf
మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో... చెల్లించని కార్మికులకు ఉపశమనం

మనామా: నిర్మాణ సంస్థలో పనిచేసే పలువురు కార్మికులకు చెల్లించబడని వేతనాల విషయంలో   కార్మిక, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖగా జోక్యం చేసుకోవడంతో నిరసన తెలియచేస్తున్నవ్యక్తులు చివరకు ఉపశమనం పొందారు.శనివారం కార్మికులు నిర్వహించిన ర్యాలీ విషయం  కార్మిక, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖకు చేరుకుంది. ఐదు నెలలుగా బకాయి పడిన కార్మికుల జీతం విడుదల చేయడంలో కంపెనీ నిర్లక్ష్యం చేసిందని తాము పడుతున్న ఇబ్బందుల గురించి కార్మికులు ఆందోళన చేశారు. ఏదేమైనా, కార్మికుల సమస్య మంత్రిత్వశాఖ దృష్టికి వెళ్లడంతో దీనిని  పరిష్కరించడానికి అధికారులు హామీ ఇచ్చిన తరువాత ర్యాలీని కార్మికులు విరమించారు.శనివారం ఉదయం సనాడ్లోని ఎస్టిక్లాల్ రహదారిపై కార్మికులు కవాతు చేస్తున్నారు. వారు మార్చిలో ఇదే నిరసన ప్రదర్శనలు చేశారు. "మంత్రిత్వ శాఖ నుంచి ఒక తాత్కాలిక పరిష్కారం దొరకలేదు అయినప్పటికీ, ఇప్పుడు ఒక స్థిరమైన పరిష్కారం ఈ సమయంలో అందించబడుతుందని ఆ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com