ప్రధాని మోదీతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ
- June 09, 2017
భారత్, పాక్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసు.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటుతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేటివ్ సమ్మిట్(ఎస్సీవో) రిసెప్షన్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని కాసేపు ముచ్చటించుకున్నారు. షరీఫ్ ఆరోగ్యం, కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 2015లో ప్రధాని మోదీ లాహోర్ వెళ్లిన సమయంలో షరీఫ్ను కలుసుకున్నారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు కలుసుకోవడం ఇదే ప్రథమం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







