ప్రధాని మోదీతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ
- June 09, 2017
భారత్, పాక్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసు.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటుతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేటివ్ సమ్మిట్(ఎస్సీవో) రిసెప్షన్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని కాసేపు ముచ్చటించుకున్నారు. షరీఫ్ ఆరోగ్యం, కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 2015లో ప్రధాని మోదీ లాహోర్ వెళ్లిన సమయంలో షరీఫ్ను కలుసుకున్నారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు కలుసుకోవడం ఇదే ప్రథమం.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









