రంజాన్ సందడిలో హైదరాబాద్
- June 09, 2017
ముస్లింల పవిత్రమాసం రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో సందడి కొనసాగుతోంది. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు... తెల్లవారు జాము నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు సైతం ముట్టుకోకుండా నిష్టతో దీక్షలో ఉంటున్నారు. మసీదులు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఎటు చూసినా రంజాన్ సందడి కన్పిస్తోంది. మహ్మద్ ప్రవక్త సూక్తుల ప్రకారం రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. ఈ నెలలో శక్తి మేరకు ఎవరైతే సత్కార్యాలు, ప్రార్థనల్లో నిమగ్నమై ఉంటారో వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారని విశ్వాసం. కాబట్టే పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతారు. పవిత్రతే పరమపదసోపానంగా భావించి పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి హృదయాలు ఆథ్యాత్మిక భావనతో నిండిపోతాయి. ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే రోజా ఉద్దేశం. దీంతో.. సాటివారి పట్ల సానుభూతితోపాటు దైవచింతన కూడా కలుగుతుందని భావిస్తారు. ఈ సమయంలో కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. రోజూ ఐదుసార్లు నమాజు, ఖురాన్ పఠనం, రాత్రుల్లో తరావీ నామాజుతో ఆరాధనలో లీనమై ఉంటారు. రంజాన్ మాసంలో పేద, గొప్ప తేడాలు చూపకుండా.. శక్తి మేరకు దాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ ఈద్ ముబార్ వేళకు ముస్లింలు సన్నద్దం అవుతారు. ఉపవాసాలు ముగిసిన తర్వాతి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు. పాతబస్తీలోని మక్కా మసీదు వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మసీదు ఇమామ్ తెలిపారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. మంచి నీరు ,ఫౌంటెన్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రంజాన్ కావడంతో నగరంలోని చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, మక్కా మసీదులను అందంగా తీర్చిదిద్దారు. సాధారణ రోజుల్లో పర్యాటకులతో కిటకిటలాడే పాతబస్తీ... రంజాన్ వేళ షాపింగ్లతో రద్దీగా మారింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







