అమృత్ సరి చేప
- June 10, 2017
కావాల్సిన పదార్థాలు
చేప - 300 గ్రాములు, అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టీస్పూన్, వాము - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కారం - ముప్పావు టీస్పూన్, కసూరి మెంతి - అర టీస్పూన్, తందూరీ మసాలా - ముప్పావు టీస్పూన్, బిర్యానీ మసాలా - పావు టీస్పూన్ (అవసరమనుకుంటే), ఆమ్చూర్ - చిటికెడు, నిమ్మరసం - ఒక టీస్పూన్, శెనగపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - కొద్దిగా, నూనె - రెండు టేబుల్ స్పూన్లు (ఆవనూనె అయితే రుచి బాగా వస్తుంది)
తయారీ విధానం:
శెనగపిండిని నూనె లేకుండా పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. పిండి రంగు మారకుండా జాగ్రత్తపడాలి.
చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి నచ్చిన సైజ్లో కోయాలి.
ఈ ముక్కలకి వాము, శెనగపిండి, నూనె తప్పించి మిగతా అన్ని పదార్థాలను పట్టించాలి.
వెడల్పాటి పాన్లో నూనె వేడిచేయాలి. అందులో వాము వేసి అది చిటపటమనేవరకు ఉంచాలి. ఇందులో నానబెట్టిన చేపముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద నాలుగు నిమిషాలు ఉంచాలి. తరువాత రెండో వైపు తిప్పి మరో ఐదు నిమిషాలు వేగించాలి.
ముక్కల మీద ఒకవైపు మాత్రం శెనగపిండి చల్లాలి. వేగించేటప్పుడు పిండి మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
ముక్కల్ని రెండోవైపు తిప్పి మళ్లీ వేగించాలి. ఒకవైపు చల్లిన శెనగపిండే రెండు వైపులకు సరిపోతుంది. అవసరమనుకుంటే మంట కాస్త పెంచుకోవచ్చు. ముక్క సరిగా ఉడికేలా వేగించాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









