అజ్మాన్ లో ఆరు గిడ్డంగులు అగ్నికి ఆహుతి
- June 11, 2017
అజ్మాన్:అజ్మాన్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి పలు గిడ్డంగులు దహనమయ్యాయి. సివిల్ డిఫెన్స్లో ఈ ప్రమాదానికి కారణాలు ఏవీ లేవని పేర్కొంటున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ప్లాస్టిక్ సామగ్రి కల్గి ఉన్న ఆరు గిడ్డంగులు, కర్మాగారాలు పూర్తిగా తగలబడిపోయాయి. తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు ఈ సంఘటన గూర్చి సమాచారం అగ్నిమాపకదళంకు తెలియచేయబడింది.అజ్మాన్ నుండి వచ్చిన అగ్నిమాపక దళం అగ్నిని సమర్ధవంతంగా నియంత్రించింది. అంతేకాక ప్రక్కనే ఉన్న గిడ్డంగులకు మంటలు వ్యాపించకుండా నిరోధించింది. అగ్నిమాపక సిబ్బంది మరియు అంబులెన్స్ సిబ్బందిని త్వరితగతిన అక్కడకు చేరుకోవడానికి మినహా గిడ్డంగులకు దారితీసే అన్ని రహదారులను భద్రతకు అనుగుణంగా పోలీసులు నిరోధించారు. రెస్క్యూ బృందం సమీపంలోని భవనాలను ఖాళీ చేయించింది. ఆ ప్రాంతంలో మంటలను నియంత్రణలో తీసుకొచ్చింది.ఫోరెన్సిక్ నిపుణులు అగ్ని ప్రమాదానికి అసలు కారణం కనుగొననున్నారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









