‘కాశీనాథుని విశ్వనాథ్’ పురస్కారాలు
- June 12, 2017
కళా తపస్వి కె. విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’లో చిన్న పిల్లాడి పాత్రలో నటించారు బాల నటి తులసి. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లోనూ, ఆ తర్వాత కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారామె. శంకరం పాత్రతో తనను తెరకు పరిచయం చేసిన గురువు విశ్వనాథ్ పట్ల ఆమెకు అపారమైన గౌరవాభిమానాలున్నాయి.
అందుకే విశ్వనాథ్ పేరుతో ఆమె పురస్కారాల్ని ఇవ్వబోతున్నారు. తులసి మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఏటా గురువు విశ్వనాథ్గారి పేరిట ‘కాశీనాథుని విశ్వనాథ్’ పురస్కారాలు ఇవ్వనున్నా. ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 20న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, దక్షిణ, ఉత్తరాది సినీ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









