డబుల్ కా మీఠా
- June 12, 2017
కావలసిన పదార్థాలు
తెల్ల బ్రెడ్ స్లయిసులు - 8
పాలు - 1 కప్పు
పంచదార - మూడున్నర టేబుల్ స్పూన్లు
మీగడ - 3 టేబుల్ స్పూన్లు
కరిగించిన తాజా నెయ్యి - 2 టే.స్పూన్లు
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12
తరిగిన పిస్తా - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం
పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి.
మరో గిన్నెలో పంచదార, రెండు టే.స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి.
బ్రెడ్ స్లయిసె్సల అంచులు కట్ చేసి త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి.
వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి.
పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.
వేయించిన బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి.
వాటి పైన చిక్కటి పాలను పోసి, పైన మిగిలిన చక్కెర పాకం పోయాలి.
తరిగిన బాదం పప్పులు, బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి.
10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది.
అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









