ఖతిఫ్ లో అత్యవసర దళ అధికారిని బలిగొన్న పేలుడు పరికరం
- June 12, 2017
ప్రజల రక్షణార్ధమై రేయంబగళ్లు కాపలా కాచే పోలీస్ అధికారులు తీవ్రవాదుల రక్త దాహానికి బలి కాబడుతున్నారు. ఈ సంఘటన అదే కోవలోనికి చెందుతుంది. స్థానిక అల్-మాసౌరా జిల్లాలోని ఖతిఫ్ ప్రాంతంలో ఆదివారం బాగా పొద్దుపోయాక గుర్తించబడని అనుమానితులు పేల్చిన ఒక పేలుడు పరికరం ఒక అత్యవసర దళాల అధికారిని దారుణంగా హతమార్చి మరో ఇద్దరు అధికారులను తీవ్రంగా గాయపరిచింది. మరణించిన ఆ అధికారి పేరు మేజర్ తారిక్ బిన్ అబ్దుల్లాతఫ్ అల్-అల్లాఖీగా పేర్కొంటున్నారు. ఖతిఫ్ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న ఈ ముగ్గురు అధికారులు ప్రయాణిస్తున్న వాహనంను ఒక పేలుడు పదార్ధాలతో కూడిన పరికరం ఏదో బలంగా ' ఢీ ' కొట్టింది. దీనితో అక్కడ ఒక భారీ విస్ఫోటనం జరిగినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









