ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతున్న డార్జిలింగ్
- June 13, 2017
గూర్ఖా జన్ముక్తి మోర్చా సభ్యులు ఉద్యమం ఉదృతం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధనతో పాటు.. బెంగాలీ ఆధిపత్యం ప్రశ్నిస్తూ జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అటు ప్రభుత్వ కార్యాలయాలను బలవంతంగా మూయించారన్న ఆరోపణలతో ఉద్యమకారులపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు కూడా చేశారు. దీంతో ఉద్యమకారులు మరింత రెచ్చిపోతున్నారు. అటు నిరవధిక ఆందోళనలతో డార్జిలింగ్ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. హోటల్స్, రవాణా సంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు కూడా విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రభుత్వం వేతనాల్లో కోతలు విధిస్తామని తప్పక హాజరుకావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







