ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతున్న డార్జిలింగ్
- June 13, 2017
గూర్ఖా జన్ముక్తి మోర్చా సభ్యులు ఉద్యమం ఉదృతం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధనతో పాటు.. బెంగాలీ ఆధిపత్యం ప్రశ్నిస్తూ జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అటు ప్రభుత్వ కార్యాలయాలను బలవంతంగా మూయించారన్న ఆరోపణలతో ఉద్యమకారులపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు కూడా చేశారు. దీంతో ఉద్యమకారులు మరింత రెచ్చిపోతున్నారు. అటు నిరవధిక ఆందోళనలతో డార్జిలింగ్ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. హోటల్స్, రవాణా సంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు కూడా విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రభుత్వం వేతనాల్లో కోతలు విధిస్తామని తప్పక హాజరుకావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









