రెండు రోజులలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోనుంది
- June 13, 2017
మస్కట్:క్రమేపీ వేసవి తీవ్రత పెరగనుందని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ మెట్రోలజి తెలిపింది. సంబంధిత అధికారి సోమవారం మాట్లాడుతూ, రానున్న రెండు రోజులలో ఈ వేసవి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయిని సూచించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం "అంతర్గత ప్రాంతాలు మరియు ఎడారులలో ఉష్ణోగ్రత పెరగడం కొనసాగుతుంది ఆ కారణంగా తదుపరి రెండు రోజులలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల మధ్యలో ఉంటుంది." గత వారం అంతర్గత ప్రాంతంలో వర్షాలు కురవడంతో పాదరస మట్టాలు తగ్గాయని , కానీ ఉష్ణోగ్రత గత రెండు రోజులలో ఓమన్ లో చాలా ప్రదేశాల్లో మళ్లీ 40 డిగ్రీల సెల్సియస్కంటే ఎక్కువ పెరిగింది. మస్కట్లోని బచర్ సోమవారం 45 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది, ఇది అమెరిట్ 46 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. సమీపంలోని బిడ్బిడ్ మరియు సామీల్ వరుసగా 45 డిగ్రీల సెల్సియస్ మరియు 46 46 డిగ్రీల సెల్సియస్ చేరుకున్నాయి, అత్యధిక నమోదు ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ రస్టాక్ లో ఉంది.
ఆదివారం గరిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఫహుద్లో 47.5 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా, ఇబ్రి 46.8 డిగ్రీల సెల్సియస్ రస్టాక్ మరియు అల్ సినినా 46.6 డిగ్రీల సెల్సియస్ మరియు సాలియిల్ 46.1 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. మంగళవారం వాతావరణ సూచన ప్రకారం, పాక్షికంగా ఆకాశం మేఘావృతం కాబడి ధఫోర్ తీరం వెంట మరియు చుట్టుపక్కల ఉన్న పర్వతాలపై ఉంటుంది. ఇది మధ్యాహ్నం అల్ హజార్ పర్వతాలపై మేఘాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. సుల్తానట్ లో చాలావరకు ఆకాశం నిర్మలంగా ఉండొచ్చని అంచనా వేస్తుంది. తీరప్రాంతాలలో చాలా వరకు ఉదయపు ప్రాంతాల మధ్య తక్కువ స్థాయి మేఘాలు ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒమన్ సముద్ర తీరప్రాంతాల వెంట, మధ్యస్థంగా నైరుతి దిశలో తేలికగా ఉంటుంది. రాత్రి.వేళ అరేబియా సముద్ర తీరప్రాంతాల మధ్య, ఇది దక్షిణంవైపుకు తాజాగా ఉంటుంది, అయితే సుల్తానేట్ యొక్క మిగతా ప్రాంతాలపై ఈ ప్రభావం మితంగా ఉంటుంది. సముద్రతీరం అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాల గరిష్ట ఉదృతి 3.2 మీటర్ల ఎత్తు మరియు మస్సంతం యొక్క పశ్చిమ తీరంలో సముద్ర కెరటాల 1.5 మీటర్ల గరిష్ట ఎత్తుతో ఉండవచ్చని వాతావరణశాఖ సూచిస్తుంది . సముద్ర అలల ఎత్తు మిగిలిన తీర ప్రాంతాలలో 1 మీటర్ ఎత్తు వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









