నటుడు హీరో ఆర్ నారాయణమూర్తికి శ్రీశ్రీ పురస్కారం
- June 15, 2017
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున జేరి సుఖమున్నదిలే, కలకానిదీ విలువైనదీ బతుకు కన్నీటి ధారలలోనే’.. అన్న మహాకవి శ్రీశ్రీ రచన ఇచ్చిన స్ఫూర్తితోనే సినీరంగంలో ఇంతవరకు రాణించినట్లు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. మహాకవి శ్రీశ్రీ వర్థంతి పురస్కరించుకుని ఎక్స్రే, టి.కృష్ణ మెమోరియల్ నాగార్జున పరిషత్ సంస్థల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో నారాయణమూర్తిని శ్రీశ్రీ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాసు పాండీబజార్లో సినిమా వేషాలు దొరక్క తిరిగి ఇంటికిపోలేక మానసికవ్యధలో ఉన్నప్పుడు శ్రీశ్రీ గీతం కలకానిదీ విన్నానని అది ఎంతో ధైర్యాన్నిచ్చినట్లు తెలిపారు. ఆ తరువాత సినీపరిశ్రమకు దాసరి తనను పరిచయం చేసినట్లు తెలిపారు. ‘రు మనదిరా ఈ వాడ మనదిరా... దొర ఎందిరో వాడి పీకుడేందిరో’ అన్న పాట పాడి నృత్యం చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎక్స్రే సంస్థ అధ్యక్షులు కొల్లూరి, నారాయణమూర్తి సామాన్య జీవితాన్ని వివరించారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సుబ్బరాజు, దేవినేని కిషోర్, ఆదాయపన్నుశాఖ సంయుక్త కమిషనర్ సత్యానందం, ఆంజనేయరాజు, సురేష్బాబు, తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి తరపున ఆర్.రాజేష్ బృందం ఆలపించిన విప్లవగీతాలు, జానపద గీతాలు శ్రోతలను రంజింపజేశాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







