18 మందికి జీవితఖైదు, 8 మందికి15 సంవత్సరాల జైలుశిక్ష
- June 17, 2017
షబబ్ అల్ దురాజ్ (దురాజ్ యూత్) అనే తీవ్రవాది బృందాన్ని ఏర్పాటు చేసినందుకు 26 మందిని దోషులుగా అత్యున్నత నేర న్యాయస్థానం నిందిస్తోంది. ఈ కేసులో 18 మందికి జీవితఖైదు జైలు మరో 8 మందికి15 సంవత్సరాల జైలులో కటకటాల వెనుక ఉండేలాగున జైలుశిక్ష విధించారు. లేని ఈ నిందితులలో ఒకరు తప్ప మిగిలిన వారందరు బహ్రెయిని జాతీయత కల్గిఉన్నవారు. వారినందరికి బహ్రెయిన్ జాతీయతను తొలగించారు. తన జైలుశిక్షా కాలం పూర్తి చేసిన తర్వా ఆ త విదేశీయుడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించారు.కోర్టు పత్రాల ప్రకారం, 2011 మరియు 2013 మధ్య కాలంలో ఐదవ ప్రతివాది బాంబులు తయారు చేశారు.ఒక జాతీయ రహదారిపై ఒక బాంబుని ఏర్పాటుచేశాడు కానీ అది విఫలమయ్యిందని చెప్పింది. ఆరవ, ఏడవ మరియు తొమ్మిదవ ముద్దాయిలను సంప్రదించి మరో బాంబును కాంక్రీట్ బ్లాకుల మధ్య దాచిపెట్టాడు ఇది పేలింది, ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబరు 18, 2013 న, జరిగిన ఒక అల్లర్లలో వీరంతా పాల్గొన్నారు, పోలీసు అధికారులను ఆ ప్రాంతానికి తరలించారు, అక్కడ వారు అధునాతన తుపాకీలతో దాడి చేశారు.దాడిలో ఒక అధికారి గాయపడ్డాడు.పోలీసుల అధికారులను లక్ష్యంగా చేసుకుని, అల్లర్లలో పాలుపంచు కునేందుకు, అదుపు చేసే బాంబులు పేల్చడంలో ముద్దాయిలపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







