ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ విజేతగా శ్రీకాంత్
- June 18, 2017
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జపాన్ ఆటగాడు సకాయ్తో తలపడిన శ్రీకాంత్ రెండు వరుస సెట్లలో విజయం సాధించాడు. 13 నిమిషాల్లోనే తొలి సెట్ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్కు రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో వెనుకబడిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకుని సుకాయ్పై విజృంభించాడు. దీంతో హోరాహోరీగా సాగిన రెండో సెట్ను శ్రీకాంత్ 21-19తో గెలిచి ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో విజేతగా నిలిచాడు. శ్రీకాంత్ కెరీర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







