బస్సు పై చర్చ కార్యక్రమం
- October 13, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనను పురస్కరించుకుని 'మోదీ ఎక్స్ ప్రెస్' పేరుతో ఎన్నారైలు ఆదివారం బస్సు యాత్ర ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే యాత్రలో ఈ బస్సు సుప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. లిటిల్ ఇండియాగా ప్రఖ్యాతి గాంచిన వెంబ్లేలోని ఈలింగ్ రోడ్డుకు ముందుగా ఈ బస్సుయాత్ర చేరుకుంటుందని స్వాగత కమిటీ ప్రతినిధి మయూరి పర్మార్ తెలిపారు. దీపావళి నాటికి ట్రాఫల్ గర్ స్క్వేర్ కు బస్సుయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వచ్చే నెలలో తొలిసారిగా బ్రిటన్ కు వస్తున్న నేపథ్యంలో 'బస్సు పే చర్చ' కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 13న వెంబ్లే స్టేడియంలో మోదీకి ఒలింపిక్స్ తరహాలో స్వాగతం చెప్పనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 400 మందిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







