సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే టాక్స్
- June 21, 2017
సౌదీ: సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే నెలకు 200 రియాల్స్ టాక్స్ పే చెయ్యాలి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3,400 పన్ను చెల్లించాలని అక్కడి గవర్నమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. ఇప్పుడు అక్కడ భారత దేశానికి చెందిన 41 లక్షల మంది వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ కొత్త చట్టంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నెలకు రూ.5,000 రియాల్స్ (రూ.85,000)జీతం వస్తున్న వారికే ఫ్యామిలీ వీసాలు ఇస్తున్నారు. 5వేల రియాల్ కంటే ఒక్క రియా తక్కువ వస్తున్నా ఫ్యామిలీ వీసాలు ఇవ్వడం లేదు. అయితే ప్రతి సంవత్సరం ఈ పన్ను 100 రియాలు పెరిగే అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రమదాన్ పండుగ సందర్బంగా సెలవులపై స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి సౌదీ వెళ్లేటప్పుడు టాక్స్ భారం మోయలేక భార్యా, పిల్లలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లడానికి సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









