సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే టాక్స్
- June 21, 2017
సౌదీ: సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే నెలకు 200 రియాల్స్ టాక్స్ పే చెయ్యాలి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3,400 పన్ను చెల్లించాలని అక్కడి గవర్నమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. ఇప్పుడు అక్కడ భారత దేశానికి చెందిన 41 లక్షల మంది వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ కొత్త చట్టంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నెలకు రూ.5,000 రియాల్స్ (రూ.85,000)జీతం వస్తున్న వారికే ఫ్యామిలీ వీసాలు ఇస్తున్నారు. 5వేల రియాల్ కంటే ఒక్క రియా తక్కువ వస్తున్నా ఫ్యామిలీ వీసాలు ఇవ్వడం లేదు. అయితే ప్రతి సంవత్సరం ఈ పన్ను 100 రియాలు పెరిగే అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రమదాన్ పండుగ సందర్బంగా సెలవులపై స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి సౌదీ వెళ్లేటప్పుడు టాక్స్ భారం మోయలేక భార్యా, పిల్లలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లడానికి సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







