మళ్లీ తెర పైకి వస్తున్నబాలయ్య నయనతార జోడి
- June 22, 2017
ఇదివరకు 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సి. కల్యాణ్ ధ్రువీకరించారు.
''బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలుంటారు. ఒక నాయికగా నయనతారను ఎంపిక చేశాం. కథ వినగానే నాయికగా నటించేందుకు ఆమె అంగీకరించారు. కచ్చితంగా బాలకృష్ణ, నయనతార జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ నెలాఖరున లాంఛనంగా షూటింగ్ ప్రారంభించి, జూలై నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్తాం'' అని ఆయన చెప్పారు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ కథలో కె.ఎస్. రవికుమార్ శైలి వినోదంతో పాటు, సెంటిమెంట్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అంశాలు ప్రధానంగా ఉంటాయి. తొలి షెడ్యూల్ను తమిళనాడులోని కుంభకోణంలో నిర్వహిస్తారు. 2018 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం.
ఎం.రత్నం సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. బాలకృష్ణతో మరో చిత్రంలో నటించడానికి నయనతార ఇటీవల తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ ఇద్దరూల మరోసారి జోడీ కడుతుండటం బాలయ్య అభిమానులను సంతోషపెడుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు









