మళ్లీ తెర పైకి వస్తున్నబాలయ్య నయనతార జోడి
- June 22, 2017
ఇదివరకు 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సి. కల్యాణ్ ధ్రువీకరించారు.
''బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలుంటారు. ఒక నాయికగా నయనతారను ఎంపిక చేశాం. కథ వినగానే నాయికగా నటించేందుకు ఆమె అంగీకరించారు. కచ్చితంగా బాలకృష్ణ, నయనతార జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ నెలాఖరున లాంఛనంగా షూటింగ్ ప్రారంభించి, జూలై నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్తాం'' అని ఆయన చెప్పారు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ కథలో కె.ఎస్. రవికుమార్ శైలి వినోదంతో పాటు, సెంటిమెంట్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అంశాలు ప్రధానంగా ఉంటాయి. తొలి షెడ్యూల్ను తమిళనాడులోని కుంభకోణంలో నిర్వహిస్తారు. 2018 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం.
ఎం.రత్నం సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. బాలకృష్ణతో మరో చిత్రంలో నటించడానికి నయనతార ఇటీవల తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ ఇద్దరూల మరోసారి జోడీ కడుతుండటం బాలయ్య అభిమానులను సంతోషపెడుతోంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









