పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటా రామ్నాథ్ కోవింద్
- June 23, 2017
రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి పదవి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటుందని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అన్నారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 'నేను గవర్నరుగా ఉన్న సమయంలో కూడా.. ఏ పార్టీకి అనుకూలంగా లేను. రాష్ట్రపతి అభ్యర్థిగా నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని అన్నారు. 'రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడతాను. త్రివిధ దళాలపై సుప్రీం కమాండర్గా రాష్ట్రపతి ఉంటారు. మన దేశ సరిహద్దు భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది'.. అని కోవింద్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా సీనియర్ నేతల సమక్షంలో కోవింద్ పార్లమెంటు భవనానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కోవింద్కు ఇప్పటికే అన్నాడీఎంకే, జేడీయూ, తెదేపా, టీఆర్ఎస్, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









