పాక్ లో పేలుళ్లు, 18మంది మృతి

- June 23, 2017 , by Maagulf
పాక్ లో పేలుళ్లు, 18మంది మృతి

వాయవ్య పాకిస్థాన్లోని పరాచినార్ నగరంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 18 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడి ఓ మార్కెట్లో తొలి పేలుడు సంభవించింది. అక్కడికి మూడు నిమిషాల వ్యవధిలో మరో పేలుడు చోటుచేసుకుంది. రంజాన్ సందర్భంగా ఇచ్చే ఇఫ్తార్ విందుకు సరకులను కొనుగోలు చేసేందుకు వచ్చిన అమాయకులు ఈ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయపడ్డారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com