ముంబై లో అంగరంగ వైభవంగా ఆడియో విడుదల

- June 23, 2017 , by Maagulf
ముంబై లో అంగరంగ వైభవంగా ఆడియో విడుదల

సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్న 'వి.ఐ.పి. 2' సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 25న ముంబైలో జరుగబోతోంది. ఇప్పటికే రెండు హిందీ చిత్రాల్లో నటించిన ధనుష్‌కు అక్కడ చక్కని గుర్తింపు ఉండటం ఒక కారణంగా కాగా, ఇందులో కాజోల్ కీలకపాత్ర పోషించడం మరో కారణం. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతోపాటు హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు కలైపులి థాను, ధనుష్ భావిస్తున్నారట. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన 'వి.ఐ.పి. -2' ట్రైలర్ నూ ఆడియోతో పాటే విడుదల చేయబోతున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com