భరత్ అంత్యక్రియలు పూర్తి
- June 25, 2017
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హీరో రవితేజ హాజరుకాలేదు. తమ్ముడు భౌతికకాయాన్ని చివరి చూపు కూడా చూడలేనని రవితేజ చెప్పారు. భరత్ భౌతికకాయాన్ని చూడడానికి ఆయన తల్లి కూడా ఇష్టపడలేదు. దాంతో కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే భరత్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. కేవలం కొద్దిమంది మిత్రులు, పరిచయస్తులు మాత్రమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు.
30 ఏళ్లుగా తమ్ముడు భరత్తో ఉన్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకుంటూ..భౌతిక కాయాన్ని కూడా చూడలేనని అన్నారు. భరత్ భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నేరుగా మహాప్రస్థానానికి తరలించారు. రవితేజ మూడో సోదరుడు రఘు మాత్రమే ఈ అంత్యక్రియలను పర్యవేక్షిస్తున్నారు. కుటుంబసభ్యులందరూ శోకసంద్రంలో ఉన్నారు. అంత్యక్రియలకు ఎవరూ రాలేకపోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకూ, మిత్రులకు చెప్పారు.
టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డుప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. కారు సగభాగం లారీ కిందకు దూసుకువెళ్లడంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందారు
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









