ఈద్ అల్-ఫిత్ర్ కోసం ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు
- June 25, 2017
అల్-ఫితర్ ఈద్ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ ఆడేల్ అల్ హషష్ పేర్కొన్నారు. శనివారం ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అల్-ఫిత్ ఈద్ కోసం అన్ని జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపట్టినట్లు . రద్దీని నివారించడానికి దేశవ్యాప్తంగా రోడ్లు మరియు విభజనలపై ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం ఈద్, అల్ ఒక పథకాన్ని సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.. ఈ పథకాన్ని ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత శాఖ మంత్రి షేక్ ఖలేద్ అల్ జర్ర అల్ సబహ్ సూచనల ద్వారా అమలుచేస్తున్నట్లు వివరించారు.ఈద్ సెలవులు సందర్భంగా పౌరులు నివాసితులు ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆనందంగా వారి వారి గమ్యాలు చేరుకోవడానికి అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. అన్ని భద్రతా డైరెక్టరేట్లు మరియు సంబంధిత సంస్థల మధ్య సమన్వయ విధానంతో ఈ సమగ్ర ప్రణాళికను అమలు చేయడానికి ఆయన నిశ్చయించుకున్నారు. భద్రతా దళాల కారణంగా అంతరాయం లేదా వైరం వంటి ప్రతికూల ప్రవర్తనాలతో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు.అదేవిధంగా మాల్స్, మార్కెట్లు మరియు వాణిజ్య ప్రదేశాల్లో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదనే విషయాన్ని పిల్లలకు సూచించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ విధులను ఉల్లంఘించిన ఎవరైనా వెంటనే చర్యలు తీసుకొంటుందని మంత్రిత్వశాఖ హెచ్చరించారు, వికలాంగులకు కేటాయించిన ప్రదేశాలలో పార్క్ చేయకూడదని కూడా ఆయన ప్రజలను కోరారు.కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రయాణీకులకు దేశవ్యాప్తంగా ఉన్న నౌకాశ్రయాలకు సంబంధించిన విషయాలను సులభతరం చేయడానికి పోర్ట్సు భద్రతా వ్యవహారాల విభాగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన సూచించారు. ఈద్ సెలవుల కోసం ఒక అవగాహన ప్రచార అమరికను నెరవేర్చడానికి డిపార్ట్మెంట్ యొక్క ప్రణాళిక కృషి చేస్తుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









