ఈద్ సమయంలో వినియోగదారుల వస్తువులు, ధరలు పెరగడంపై నిశిత దృష్టి

- June 27, 2017 , by Maagulf
ఈద్ సమయంలో  వినియోగదారుల వస్తువులు, ధరలు పెరగడంపై నిశిత దృష్టి

రియాద్: ఈద్ అల్-ఫితర్ సమయంలో రిటైల్ దుకాణాలలో విక్రయించబడుతున్న వివిధ వస్తువుల విక్రయాలు వాటి ధరల అమలు తీరుపై   వాణిజ్య మరియు ఇన్వెస్ట్మెంట్ మంత్రిత్వశాఖ (ఎంసిఐ) ఇన్స్పెక్టర్లను నియమించారు.జకాత్ అల్- గిరాకీని కలిగివున్న పలు బ్రాండ్ వస్తువులు, దుస్తులు, ఈద్ ఉపకరణాలు మరియు స్వీట్లు ఉన్నాయి. తనిఖీ ప్రచారంలో  ప్రతి అంశం మీద ధర ట్యాగ్లు తప్పనిసరిగా ఉండాలని, అలాగే అవి రిజిస్ట్రేషన్ వద్ద వసూలు చేయబడిన వాటికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆయా దుకాణాలలో వాణిజ్యపరంగా మోసం లేదని నిర్ధారించడానికి ఈ సమయంలో సూపర్ మార్కెట్లు మరియు దుకాణాల అధికారుల జట్లు చేత పర్యవేక్షించబడుతున్నాయి.

వినియోగదారులు కాల్ సెంటర్ (1900) ద్వారా వారి ఫిర్యాదులను, సమాచారమును  తెలియచేయాలని సూచించారు.  వినియోగదారులు తాము కొనుగోలు చేసిన దుకాణంలో వాణిజ్యపరమైన ఉల్లంఘన జరిగినట్లు వారి ఫిర్యాదును  స్మార్ట్ఫోన్ల ద్వారా తెలియచేయాలని సంబంధిత అధికారులు వినియోగదారులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com