తమిళ హాస్య నటుడి నగలు దోపిడీ
- June 27, 2017
తమిళ హాస్యనటుడు కొట్టాచ్చి దారిదోపిడీకి గురయ్యారు. సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేందుకు అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో కొట్టాచ్చి బస్లో సేలం చేరుకున్నాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆటోలో మరో ఇద్దరు ఎక్కారు. సురమంగళం, నరసోదిపట్టి ప్రాంతానికి చేరుకోగానే ఆటోలో ఉన్నవాళ్లు కొట్టాచ్చిపై దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు సవర్ల బంగారు గొలుసు, రూ.2,500 నగదు, ఏటీఎం కార్డు లాక్కొని ఆటో నుంచి కిందకు తోసేశారు.
గాయాలపాలైన కొట్టాచ్చి సేలంకు చెందిన మరో హాస్యనటుడు బెంజిమన్కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించాడు. బెంజిమెన్ అక్కడికి రాగా ఇద్దరూ దోపిడీపై సురమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి ఓ పోలీస్ అధికారి తెలుపుతూ కొట్టాచ్చి సేలం వచ్చినప్పుడు మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. ఆటోడ్రైవర్ ఇద్దరు హిజ్రాలతో కలిసి కొట్టాచ్చి వద్ద దోపిడీ చేసినట్టు చెప్పారు. ఆ డ్రైవర్ ఎవరన్నది తెలిసిందని, అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!









