మ్యారేజ్ సర్టిఫికెట్ ఫోర్జరీ: వ్యక్తికి జైలు
- June 29, 2017
తన భార్య కోసం వీసా పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ని ఫోర్జరీ చేసినందుకుగాను ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. జులై 12న నిందితుడ్ని అరెస్టు చేయడం జరిగింది. భార్య వీసాకి సంబంధించి ప్రాసెస్ పూర్తి చేసుకునే క్రమంలో నిందితుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ని సంప్రదించిన సందర్భంగా నిందితుడి నేరాన్ని గుర్తించారు. శ్రీలంకకు చెందిన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫోర్జరీ సర్టిఫికెట్ కోసం 1,200 దిర్హామ్ని చెల్లించినట్లుగా న్యాయస్థానం యెదుట వెల్లడించాడు. కొలంబోలోని యూఏఈ ఎంబసీకి చెందిన స్టాంప్ని ఫోర్జరీ చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. న్యాయస్థానంలో విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ అతనికి జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం, జైలు శిక్ష పూర్తయిన అనంతరం డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







