హైదరాబాద్ లో 27 మంది బైక్ రేసర్లు అరెస్ట్
- June 30, 2017
హైదరాబాద్ -బెంగుళూరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 27మందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ సింప్లేక్స్ వద్ద బైక్ రేసింగ్ చేస్తున్న వీరిని పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ నరేందర్ను ఢీకొట్టి పారిపోయారు. గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అనంతరం రేసింగ్కు పాల్పడిన వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్నగర్,సులేమాన్ నగర్లకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. మైనర్ల తల్లితండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







