పీతల బిర్యాని
- July 02, 2017కావలసిన పదార్థాలు: (బాసుమతి) బియ్యం - 250 గ్రా., (పెద్ద) పీతలు - 100 గ్రా., వెన్న - 50 గ్రా., ఉల్లిపాయలు - 2, టమోటాలు -2, పచ్చిమిర్చి - 1, జీరా, దనియా, మసాలపొడి - 1 టీ స్పూను చొప్పున, కారం - ఒకటిన్నర టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, పుదీనా, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, (స్పూను పాలలో నానబెట్టిన) కుంకుమపువ్వు - 4 కాడలు, నెయ్యి - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: బియ్యంలో కుంకుమపువ్వు కలిపి (పొడిగా) అన్నం వండి పక్కనుంచాలి. కూరగాయల్ని సన్నగా తరగాలి. పీతలలో ఎముకల్ని తీసేయాలి (ఇష్టమైతే 4 పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు). కడాయిలో వెన్న కరిగించి ఉల్లి, మిర్చి, టమోటా, పుదీనా, కొత్తిమీర తరుగు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాల పొడులు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. తర్వాత పీత ముక్కలు, ఉప్పు వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గించాలి. పీత (ముక్కలు) ఉడికిన తర్వాత కడాయి దించేయాలి. ఒక లోతైన పాత్రలో ఉడికిన అన్నం, పీత మిశ్రమం ఒకదాని తర్వాత ఒకటి లేయర్లుగా పరిచి పైన నెయ్యి , కొన్ని పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..