బీహార్‌ రాష్ట్రం లో పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి

- July 09, 2017 , by Maagulf
బీహార్‌ రాష్ట్రం లో పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి

బీహార్‌ రాష్ట్రాన్ని ఆదివారం పిడుగులు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 16 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ మేరకు బీహార్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ ఓ ప్రకటన విడుదల చేసింది.
వైశాలి జిల్లాలో ఐదుగురు పిడుగుపాటుకు గురయ్యారని తెలిపింది. భోజ్‌పూర్‌, బుక్సర్‌, సంస్తిపూర్‌లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. సరన్‌, అరారియా, పాట్నా, ఔరంగాబాద్‌ జిల్లాల్లో ఒకరు మరణించారని వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నితీశ్ సర్కార్ రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com