జర్మనీలో ప్రకాశం జిల్లా యువకుడు మల్లికార్జునరావు మృతి
- July 09, 2017
జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ పరిధిలోని కట్టవారిపాలెం గ్రామానికి చెందిన కట్టా రమణయ్య(రేషన్ డీలర్) కుమారుడు మల్లికార్జునరావు(22) 55 రోజుల క్రితం ఉద్యోగం నిమిత్తం జర్మనీ వెళ్లాడు. అక్కడ ఈఎస్ఎస్ఎన్ నగరంలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం విహార యాత్ర నిమిత్తం ఆరుగురు యువకులతో కలిసి ఓ నదిలో పడవ ప్రయాణానికి వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జునరావుతో పాటు మరో యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మల్లికార్జునరావు మృతి చెందినట్లు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అతడి తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సమాచారం అందింది. చేతికి అందివచ్చిన కుమారుడు అకాల మృతితో తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









