జర్మనీలో ప్రకాశం జిల్లా యువకుడు మల్లికార్జునరావు మృతి
- July 09, 2017
జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ పరిధిలోని కట్టవారిపాలెం గ్రామానికి చెందిన కట్టా రమణయ్య(రేషన్ డీలర్) కుమారుడు మల్లికార్జునరావు(22) 55 రోజుల క్రితం ఉద్యోగం నిమిత్తం జర్మనీ వెళ్లాడు. అక్కడ ఈఎస్ఎస్ఎన్ నగరంలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం విహార యాత్ర నిమిత్తం ఆరుగురు యువకులతో కలిసి ఓ నదిలో పడవ ప్రయాణానికి వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జునరావుతో పాటు మరో యువకుడు మృతి చెందినట్లు సమాచారం. మల్లికార్జునరావు మృతి చెందినట్లు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అతడి తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సమాచారం అందింది. చేతికి అందివచ్చిన కుమారుడు అకాల మృతితో తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







