అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం కూలి 16 మంది మృతి
- July 11, 2017
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం మిస్సిస్సిపీ ప్రాంతంలో కుప్పుకూలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని అమెరికా నావికాదళం ధ్రువీకరించింది. అయితే ఈ విమానంలో16 మంది సైనికులు మరణించరాని దేశ పౌరులు ఎవరైన ఉన్నారనే విషయం తెలియదని మెరైన్స్ డైరెక్టర్ ఫ్రాంక్ రాండల్ తెలిపారు.
ఈ ఘటన సోమవారం సాయంత్రం సంభవించిందని, ఇది లెఫ్లోర్లోని కౌంటీ తీరప్రాంత గస్తీదళానికి చెందిన కేసీ-130 రవాణ విమానమని యూఎస్ మెరైన్స్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ విమానాన్ని ఇంధన రవాణా కోసం వినియోగిస్తున్నారు. ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలిపోగా ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 12 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









